హిందువుల పండుగల పైనే ఆంక్షలు ఇంకెంతకాలం సహించాలి : హిందువాహిని
హిందూ సమైఖ్య సభ ,ఇందూరు, 13/09/2015 : గణేష్ ఉత్సవాల వంటి హిందు సార్వజనిక పండుగలు వచ్చినప్పుడు మాత్రమే ప్రభుత్వానికి ధ్వని కాలుష్య నివారణ చట్టం గుర్తుకురావడం శోచనీయం అని హిందువాహిని అభిప్రాయపడింది.
ఇందూరు (నిజామాబాద్) లో తేది 13/09/2015 నాడు హిందువాహిని అధ్వర్యంలో జరిగిన " హిందూ సమైఖ్య సభ " విజయవంతం అయ్యింది, ఈ సభకు ముఖ్య అతిది గా హాజరైన టి రాజా సింగ్ మాట్లాడుతూ ' గణేష్ ఉత్సవాలకు DJ ల అనుమతి నిరాకరించే ముందు ఇతర మతాల ప్రార్థనాలయాల వద్ద ఉన్న లౌడ్ స్పీకర్లను తొలగించి తమ చిత్తశుద్ధిని ప్రభుత్వం నిరూపించుకోవాలి, కేవలం హిందు సామజిక ఉత్సవాల సమయంలోనే వాటిపై రకరకాల వాదనలు చేయడం మూర్ఖత్వమే అవుతుంది, ఈ పరిణామాలను ఇంకేతో కాలం సహించే ఓపిక హిందు సమాజం లో లేదు, ప్రభుత్వం ఇప్పుడే మేల్కొని మెజారిటి హిందువుల మనోభావాలను గౌరవిస్తే మంచిది అని అన్నారు "
ఈ కార్యక్రమం లో BJP MLA శ్రీ టి రాజా సింగ్ గారు, హిందు వాహిని ప్రాంత అధికారులు శ్రీ త్రివిక్రమ రావ్ గారు, శ్రీ వెంకట నివాస్ గారు, పుర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు .
హిందువుల పండుగల పైనే ఆంక్షలు ఇంకెంతకాలం సహించాలి : హిందువాహిని
Reviewed by JAGARANA
on
10:14 PM
Rating:

Post Comment
No comments: