Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

సిద్దిపేట లో ఘర్ వాపసి : 13 కుటుంబాల స్వధర్మ స్వీకృతి

సిద్దిపేట, ధర్మ ప్రసార్ , 05/08/2015 : మెదక్ జిల్లా సిద్దిపేటలో గతం లో క్రైస్తవులుగా మారిన 8 గ్రామాలకు చెందిన 13 కుటుంబాలు స్థానిక హనుమాన్ ఆలయంలో జరిగిన యజ్ఞ కార్యక్రమం ద్వారా తిరిగి తమ మాతృధర్మమైన హిందుత్వాన్ని స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో మాన్య శ్రీ గుమ్ముల సత్యం గారు విహిప కేంద్రీయ స్వాహా కార్యదర్శి ( ధర్మ ప్రసార్ ) మార్గదర్శనం చేస్తూ " స్వధర్మే నిధనం శ్రేయ అంటూ భగవద్గీతలో ఆనాడే శ్రీ కృష్ణ పరమాత్ముడు తెలియజేసిన విషయాన్ని మరిచి దూరపు కొండలు నులుపు అన్న చందాన అనేక మంది ప్రలోభాలకు లోనై ఇతర మతాలను స్వీకరిస్తూ ఉన్నారు, ఇది చాల బాదాకరం, కాని మతం మారిన కొన్ని రోజుల్లోనే పర ధర్మో భయావహ అన్న విషయాన్ని అనుభవంలోకి తెచ్చుకుని తిరిగి తమ మాతృధర్మంలోని వస్తున్న మీ అందరికి హృదయ పూర్వక ఆహ్వానం పలుకుతున్నాను, ఇంకా అనేక మంది తిరిగి తమ అమ్మ ఒడిలోనికి రావడానికి సిద్ధంగా ఉన్నారు వారందరికి మనమే మార్గ దర్శకులం కావలి " అని అన్నారు .            
సిద్దిపేట లో ఘర్ వాపసి : 13 కుటుంబాల స్వధర్మ స్వీకృతి Reviewed by JAGARANA on 7:18 PM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.