Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

ఎంత విచిత్రం?



క్రైస్తవ మతస్తులకు క్రీస్తు ఒక్కడే దేవుడు. బైబిల్ ఒక్కటే పవిత్ర గ్రంధం. 

కానీ లాటిన్ కేథలిక్కులు సిరియన్ కేథలిక్ చర్చిలోకి అడుగుపెట్టరు. ఈ రెండు వర్గాలవారూ మార్తోమా చర్చిలోకి అడుగుపెట్టరు. ఈ మూడు వర్గాలకు చెందినవారు పెంటేకాస్ట్ చర్చి మొహం చూడరు. ఈ నాలుగు వర్గాలవారూ సాల్వేషన్ ఆర్మీ చర్చి గుమ్మం తొక్కరు. ఈ ఐదు వర్గాలవారు సెవెన్త్ డే ఎడ్వెన్టిస్ట్ చర్చిలోకి అడుగుపెట్టరు. ఈ ఆరు వర్గాలవారూ ఆర్థొడాక్స్ చర్చికి వెళ్ళరు. పై ఏడు వర్గాలవారు జాకోబైట్ చర్చికి వెళ్ళరు.

ఇలా ఒక్క కేరళ రాష్ట్రంలోనే క్రైస్తవులలో 146 వర్గాలున్నాయి. వీళ్ళల్లో ఎవరూ మరొకరి చర్చిలలోకి వెళ్ళరు, మరొకరిని తమ చర్చిలలోనికి రానివ్వరు! ప్రపంచమంతటా క్రైస్తవులలో ఇదే గోల. 

అందరికీ ఒకే క్రీస్తు, ఒకే బైబిల్, ఒకే యెహోవా. కానీ ఎంత ఆశ్చర్యం. ఎంత సిగ్గుపడాల్సిన విషయం? వీళ్ళా ప్రపంచాన్నంతటినీ క్రీస్తు సామ్రాజ్యంగా ఏకం చెయ్యాలనుకుంటున్నది?


సరే .. ఇంకా ఇస్లాం ముచ్చట. 


మహామ్మదీయులందరికీ ఒకే అల్లాహ్ .. ఒకే కురాన్ .. 

కానీ వీళ్ళలో షియాలకు, సున్నీలకు ప్రపంచంలో ఎక్కడా ఒకరంటే ఒకరికి పడదు. ఒకరినొకరు చంపుకుంటూనే ఉంటారు. ముస్లిం దేశాలలోనే ఈ రెండు వర్గాల మధ్య నిత్యం కొట్లాటలు జరుగుతూనే ఉంటాయి. 

షియాలు సున్నీల మసీదులకి వెళ్ళరు. వీళ్ళిద్దరూ అహమ్మదీయుల మసీదులకి వెళ్ళరు. ఈ మూడు వర్గాలవారూ సూఫీ వారి మసీదుల్లోకి అడుగుపెట్టరు. ఈ నాలుగు వర్గాలవారు ముజాహిద్దీనుల మసీదుల వైపే చూడరు. 


ఇలా ముస్లింలలో పదమూడు ప్రధాన వర్గాలున్నాయి. వారిలోని ఉప వర్గాలకు లెక్కేలేదు. ఒకరినొకరు చంపుకోవడం, ఒకరిపైనొకరు బాంబులు వేసుకోవడం, సామూహిక హత్యాకాండలు, అత్యాచారాలు ముస్లింలలో మామూలే. 


ఇరాక్ దేశంపై అమెరికా దాడి చేయడాన్ని ఆ చట్టు ప్రక్కల ఉన్న ముస్లిం దేశాలన్నీ సమర్ధించాయి. 

ప్రపంచంలో బహాయీ సంప్రదాయం వారు ఉన్నారు. వారు కూడా అల్లాని ఆరాధిస్తారు. ఖురాన్ని నమ్ముతారు. ఒకే ఒక్క తేడా ఏమిటంటే మహమ్మద్ ప్రవక్త మరో రూపంలో వస్తాడని వారు అన్నారు. అంతే ఒక్క టెహరాన్ (ఇరాన్ రాజధాని) లో ఒక్క గంట వ్యవధిలో ఏభై ఆరు వేల మంది బహాయీలని ఊచకోత కోసేరు. ఇస్లాంలో ఎంత అసహనం! 


ఒకడే ప్రభువు అల్లాహ్ .. ఒకే పవిత్రగ్రంధం కురాన్. వీళ్ళా ప్రపంచాన్ని "దారుల్ ఇస్లాం"గా మార్చి శాంతిని స్థాపించేది? 

ఇక హిందువుల విషయానికొద్దాం. 

హిందూ సమాజానికి సంబంధించి 1,280 పైగా ప్రధాన మాట గ్రంధాలున్నాయి. వాటికి పదివేలకి పైగా వ్యాఖ్యానాలు, లక్షకి పైగా ఉప వ్యాఖ్యానాలు ఉన్నాయి. ఒక్క భగవద్గీతకే వెయ్యికి పైగా వ్యాఖ్యానాలు ఉన్నాయి. హిందువులు భగవంతుడిని లెక్క లేనన్ని రూపాలలో ఆరాధిస్తారు. అమెరికాలో పర్యటిస్తున్నప్పుడు స్వామీ వివేకానందని ఎవరో అడిగారట "మీ హిందువులకు మూడు కోట్ల మంది దేవతలున్నారట. ఇదెలా సాధ్యం?" అని. అందుకు సమాధానంగా వివేకానందుడు "చూడండి! చిన్న సవరణ. ప్రస్తుతం మా దేశంలో జనాభా పెరిగింది. ఇప్పుడు మాకు ముప్పై కోట్ల మంది దేవీదేవతలున్నారు" అని అన్నారు. "ఏకం సత్. విప్రాః బహుధా వదంతి" అని ఋగ్వేదం చెప్తోంది. అంటే "సత్యం ఒక్కటే. దానిని పండితులు బహు విధాలుగా వర్ణించి చెప్తారు" అని అర్థం. 

హిందూ సమాజంలో అనాదిగా వేల ఋషులు ఉద్భవించారు. వివిధ సంప్రదాయాలకు చెందిన ఆచార్యులు నిత్యం మార్గదర్శనం చేస్తున్నారు. మన సమాజంలో ఎన్నో వేషభాషలున్నాయి. 


అయినా హిందువులు అన్ని దేవాలయాలకీ వెళ్తారు. ఒకరి పట్ల ఒకరు గౌరవ భావంతోనే ఉంటారు, ఆలోచనాపరమైన భేదాలున్నప్పటికీ. హిందువులలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక దేవాలయానికి వెళ్ళి తమకు నచ్చిన రీతిలో పూజించుకోవచ్చు. కావాలనుకుంటే తమకి నచ్చినట్లు దేవుడిని తిట్టుకోవచ్చు కూడా. 


మొదటి నుంచీ హిందూ సమాజంలో దేవీదేవతల గురించి గాని, సంప్రదాయాల గురించి గానీ ఒకరితో ఒకరు వాదించుకోవడం,  ఒకరిపైనొకరు దాడి చేసుకోవడం లేనే లేవు. 


అయినా సెక్యులర్ మేధావులుగా చెలామణీ అవుతున్న వారు మాత్రం హిందువులను చాందసులుగా, అసహనపరులుగానే చిత్రిస్తున్నారు. 


ఎంత విచిత్రం !!!

ఎంత విచిత్రం? Reviewed by rajakishor on 9:33 AM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.