Top Ad unit 728 × 90

రాహుల్ గాంధీ అసంబద్ద వ్యాఖ్యల పై ఎలక్షన్ కమిషన్ కు పిర్యాదు చేసిన సంఘ్

బెంగళూరు 08/03/2014 : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పై జాతిపిత మహాత్మా గాంధీ హత్యను ఆపాదిస్తూ కాంగ్రెస్ పార్టి ప్రధాన కార్యదర్శి శ్రీ రాహుల్ గాంధీ చేసిన అసంబద్ద వ్యాఖ్యలకుగాను రాహుల్ గాంధీ పై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ శ్రీ రామ్ మాధవ్ ( అఖిల భారతీయ సహా ప్రచార ప్రముఖ్ - రా.స్వ.స ) నేతృత్వంలోని ముగ్గురు సంఘ ప్రముఖ నాయకులతో కూడిన బృందం గురువారం రోజు (07/03/2014) సాయంత్రం స్థానిక బెంగళూరు నగరంలో ఆర్ సి రోడ్డులోని కర్ణాటక ప్రధాన ఎన్నికల అధికారి అనిల్ కుమార్ ఝా కార్యాలయంలో పిర్యాదు నమోదు చేయడం జరిగింది.
పిర్యాదు చేసిన అనంతరం మీడియా తో మాట్లాడుతున్న శ్రీ రాం మాధవ్  
పిర్యాదు ప్రతిని డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి



ఈ బృందంలో శ్రీ రామ్ మాధవ్ గారితో పాటుగా విశ్రాంత న్యాయమూర్తి శ్రీ పర్వత రావు గారు, మరో విశ్రాంత న్యాయమూర్తి శ్రీ విష్ణు కక్జి గారు ఉన్నారు, ప్రఖ్యాత సుప్రీం కోర్టు న్యాయవాది భారత్ కుమార్ గారు వీరితో పాటు కర్ణాటక ప్రధాన ఎన్నికల అధికారిని కలిసి లిఖిత పూర్వక పిర్యాదు నమోదు చేయడం జరిగింది.
      
రాహుల్ గాంధీ అసంబద్ద వ్యాఖ్యల పై ఎలక్షన్ కమిషన్ కు పిర్యాదు చేసిన సంఘ్ Reviewed by JAGARANA on 8:19 AM Rating: 5
All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.