Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

RSS సర్ కార్యవాహ(ప్రధాన కార్యదర్శి)గా సురేష్(భయ్యా)జి జ్యోషి ఏకగ్రీవ ఎన్నిక

రేశంబాగ్, నాగపూర్, 14/03/2015 : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ కార్యవాహ (ప్రధాన కార్యదర్శి) గా మాన్య శ్రీ సురేష్ (భయ్యా) జి జ్యోషి వరుసగా మూడో సారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అఖిల భారతీయ ప్రతినిధి సభ రెండో రోజున ఈ ఎన్నికలు జరిగాయి, వచ్చే మూడు సంవత్సరాల వరకు ఆయన ఈ భాద్యతలలో కొనసాగనున్నారు, గతంలో 2009-2012 , 2012-2015 మధ్య కాలంలో రెండు సార్లు ఇదే బాధ్యతని నిర్వర్తించారు, ఈ సారి 2018 మార్చి వరకు ఆయన ఈ బాధ్యతలో కొనసాగనున్నారు.

సంఘ్ లిఖిత రాజ్యాంగం ప్రకారం ఉత్తర క్షేత్ర సంఘ్ చాలక్ భజరంగ్ లాల్ జి గుప్తా ఎన్నికల అధికారిగా ఉన్న ఈ ఎన్నికలో బిహార్ క్షేత్ర సంఘ్ చాలక్ సిద్ది నాథ్ సింగ్ సురేష్ జి పేరును ప్రతిపాదించగా రాజస్థాన్, దక్షిణ మధ్య , పశ్చిమ క్షేత్ర సంఘ్ చాలక్ లు మాన్య శ్రీ డా భగవతి ప్రకాష్, రామకృష్ణా రావు, సునీల్ మెహతా తదితరులు మద్దత్తు తెలిపారు.
ఒకే ఒక్క నామినేషన్ వచ్చిన ఈ ఎన్నికలో మాన్య శ్రీ భయ్యాజి జ్యోషి ఏకగ్రీవంగా సంఘ్ సర్ కార్యవాహ గా ఎన్నికయ్యారు.  
RSS సర్ కార్యవాహ(ప్రధాన కార్యదర్శి)గా సురేష్(భయ్యా)జి జ్యోషి ఏకగ్రీవ ఎన్నిక Reviewed by JAGARANA on 6:21 AM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.