ఈశాన్య భారత విద్యార్థుల సమశ్యల పై ప్రధాని మోడిని కలసిన ABVP బృందం
న్యూడిల్లి, 27/06/2014 : పరిషద్ అధ్యక్ష, కార్యదర్శులు శ్రీ మురళి మనోహర్, శ్రీహరిలతో కూడిన అఖిల భారతీయ విద్యార్థి పరిషద్ (ABVP) జాతీయస్థాయి ఉన్నత ప్రతినిధి బృందం తేది 26/06/2014 న భారత ప్రధాన మంత్రి మాననీయ నరేంద్ర మోడిని కలసి ఈశాన్య భారత విద్యా, విద్యార్థుల సమశ్యల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని వినతి పత్రం అందించారు.
మోడిని కలసిన విద్యార్థి బృందం రాష్ట్ర స్థాయి యునివర్సిటిలు, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న మాదక ద్రవ్యాల అక్రమ రవాణ, వెనుకబడిన కులాలు / తెగల కోసం ఏర్పాటు చేయాల్సిన పథకాలు, పేద బలహీన వర్గాల విద్యార్థులను ఆదుకునేందుకు చేపట్టాల్సిన తక్షణ చర్యలు, గత ప్రభుత్వాల పాలనలో దృష్టి పెట్టని నైపుణ్యాలను మెరుగుపరిచే శిక్షణ తదితర అంశాల పై దాదాపు 45 నిమిషాల పాటు చర్చించారు.
మూలం : విశ్వ సంవాద కేంద్ర - కర్ణాటక
ఈశాన్య భారత విద్యార్థుల సమశ్యల పై ప్రధాని మోడిని కలసిన ABVP బృందం
Reviewed by JAGARANA
on
8:59 AM
Rating:
Reviewed by JAGARANA
on
8:59 AM
Rating:

No comments: