Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

"దావూద్ ఇబ్రహీంను పట్టుకోవడం కేంద్ర ప్రభుత్వానికి చేతకాకపోతే చెప్పమనండి, మా బజరంగ్‌దళ్ కార్యకర్తలను పంపిస్తాం" : BGUS బహిరంగ సభలో స్వామి చిన్మయానంద

భాగ్యనగర్ 02/09/2013  : భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో స్థానిక నిజాం కళాశాల  మైదానం జరిగిన బహిరంగ సభకు భారి ఎత్తున గణేష్ మండపాల నిర్వాహకులు హాజరయ్యారు, ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా విశ్వ హిందూ పరిషద్ అంతర్జాతీయ సంరక్షకులు మాన్య శ్రీ అశోక్ సింఘాల్ గారు హాజరయ్యారు , ఈ సభకు అతిథులుగా కమలానంద భారతి, పరిపుర్ణానంద స్వామి, గో సంరక్షణ సమితి నుంచి నిర్వలా యోగానంద భారతి, దత్తాత్రేయ పీఠాధిపతి అవదూత రామకృష్ణానంద స్వామి తదితరులు హాజరయ్యారు. సమితి అధ్యక్షులు మాన్య శ్రీ రాఘవ్ రెడ్డి గారు (విహిప అంతర్జాతీయ అధ్యక్షులు ) సభకు అధ్యక్షత వహించారు . 
భాగ్యనగర్ గణేష్ ఉత్సవాలు - హిందూ సంఘటనాత్మక శక్తికి నిదర్శనం : మాన్య శ్రీ అశోక్ సింఘాల్ 
ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా హాజరైన మాన్య శ్రీ అశోక్ సింఘాల్ విశ్వ హిందూ పరిషద్ సంరక్షకులు మార్గదర్శం చేస్తూ " భాగ్యనగర్ లో ప్రతి సంవత్సరం జరిగే గణేష్ ఉత్సవాలు హిందూ సంఘటనత్మక శక్తికి ప్రతీకలుగా నిలుస్తున్నాయి , ఈ ఉత్సవాలు ఇంత భారిగా జరుగడానికి ముందు భాగ్యనగర్ లో చీటికి మాటికి హిందువుల పై దాడులు జరుగుతూఉండేవి, నిర్భందాలు ఉండేవి కాని ఒక్కసారి సంఘటిత హిందూ సమాజం తన శక్తి ప్రదర్శన చేసిన తర్వాత ఈ పరిస్థితి మారింది , ఇది చాల శుభసూచకం , లోకమాన్య బాలగంగాధర్ తిలక్ సాముహిక గణేష్ ఉత్సవాల ద్వార సమాజం నుండి ఆశించిన మార్పు ఇదే" అని అన్నారు    
హిందూ శ్రద్ద కేంద్రాల పై వ్యూహాత్మక దాడి జరుగుతుంది : స్వామి పరిపూర్ణా నంద 
తదుపరి శ్రీ శ్రీ శ్రీ పరిపూర్ణ నంద సరస్వతి మాట్లాడుతూ "  హిందూ మతంపై, సంస్కృతిపై అనేక రకాలుగా దాడులు జరుగుతున్నాయి , మత మార్పిడీల వల్ల హిందూ సంస్కృతి దెబ్బతినే ప్రమాదం పొంచి ఉంది , వాటిని అరికట్టడానికి హిందూ జాతి సదా జాగృతంగా ఉండాలి , ప్రభుత్వాలు వ్యూహాత్మకంగానే హిందూ శ్రద్ద కేంద్రాలపై దాడులు చేస్తూ అశేష హిందూ సమాజ మనో భావాలతో ఆడుకుంటున్నాయి , ఇది చాల దురదృష్టకరం దానిలో భాగంగానే హిందువుల ఆరాధ్య దైవం శ్రీ రాముని చేత నిర్మిత శ్రీరామ సేతు ను కూల్చడం , పవిత్ర గంగానది ని ప్రక్షలనలో నిర్లక్షం వహించడం , సామూహికంగా జరుపుకునే హిందూ ఉత్సవాల పై అక్రమ నిబందనలు విధించడం లాంటి పనులు చేస్తున్నాయి , వీటన్నిటి నుండి హిందూ సమాజన్ని , హిందూ దేశాన్ని రక్షిచుకోవడానికి కేవలం హిందూ ఓటు బ్యాంకును నిర్మాణం చేయడమే పరిష్కారం " అంటూ స్వామీజీ చేసిన ఉపన్యాసం ప్రతి ఒక్కరిని హిందూ ఓటు బ్యాంకు దిశగా ఆలోచించేల స్పూర్తి నిచ్చింది .  
అంగరంగ వైభవంగా హిందూ గణేష్ ఉత్సవాలు జరగాలి : స్వామి కమలానంద భారతి 
శ్రీశ్రీశ్రీ కమలానంద భారతి స్వామి మాట్లాడుతూ ' హిందూ సామజిక ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగాలి , సమాజం లోని క్రింది స్థాయి కి ఈ ఉత్సవాలు చేరాలి , హిందూ సమాజం నుండి అస్పృశ్యత పూర్తిగా తొలగిపోవాలి ,  సమాజం లో ఉన్న కొన్ని రుగ్మతలు ఈ ఉత్సవాల మాధ్యమంగా తొలగిపోవాలి ,  హిందువులు సభలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వం 1000 ఎకరాల స్థలాన్ని కేటాయించాలి , అలాగే హిందువులకు శ్మశాన వాటికల కోసం ప్రతీ గ్రామంలో ప్రభుత్వం భూమినివ్వాలి,  గత కొన్ని సంవత్సరాల క్రితం గణేష్ ఉత్సవాలు అంటే కేవలం జల్సాకు వేదికగా ఉండేది , కాని ఇప్పుడు భాగ్య నగర్ గణేష్ ఉత్సవ సమితి కృషితో జాతీయ వాద ఉత్సవం గా మారింది , సినిమా పాటల స్థానే దేశ భక్తీ పాటలు వినిపిస్తున్నాయి , పిచ్చి నృత్యాల స్థానే భజన కార్యక్రమాలు ఏర్పాటు అవుతున్నాయి . ఈ ఉత్సవాలు ఇలాగే కొనసాగి భాగ్యనగరం - నిజంగా భాగ్యవంతం కావాలని ఆ వాక్రతుండుని పార్తిస్తున్నాను " అని అన్నారు.
గణేష్ మండపాల నిర్వహణకు  పూర్తిగా ఉచిత విద్యుత్తు ఇవ్వాలి : మాన్య రాఘవ రెడ్డి 
తదుపతి మాన్య రాఘవరెడ్డి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు మాట్లాడుతూ ' భాగ్యనగర్ గణేష్ ఉత్సవం ఒక ట్రెండ్ సెట్టర్ అయింది ఒక చరిత్రను నిర్మించింది , ప్రపంచంలో ఇప్పుడు అనేక దేశాలు భాగ్యనగర్ గణేష్ ఉత్సవాల గురించి మాట్లాడుకుంటున్నాయి , హైదరాబాద్ కు ఇంతటి కీర్తిని ఆపాదించిన గణేష్ ఉత్సవాలపై ప్రభుత్వాం తన నిర్లక్ష్య పురిత వైఖరిని విడనాడాలి , నేను ఈ సందర్భంగా ప్రభుత్వానికి కొన్ని డిమాండ్లు చేస్తున్నాను , 

  • గణేష్ మందప నిర్వకులపై పోలిసుల వేదింపులు వెంటనే ఆపాలి .
  • గణేష్ మండపాలకు పూర్తిగా ఉచిత విద్యుత్తు ఇవ్వాలి . 
  • గణేష్ మండపాలకు వెంటనే ప్రభుత్వ పర అనుమతులు ఇవ్వాలి .
  • విగ్రహాల పై దాడులు చేసే ముష్కర ముకలపై వెంటనే చట్టబద్ద చర్యలకు పూనుకోవాలి 
గణేష్ మందప నిర్వాహకులకు కూడా కొన్ని సూచనలు ఇస్తాను దయచేసి వాటిని తు చ తప్పక పాటించాలి .

  • ప్రతి గణేష్ మండపం పై భగవత్వజం ఎరుగావేయాలి .
  • స్వామి వివేకానంద 150 జయంతి సంవత్సరం అయినందున ప్రతి మండపం దగ్గర పెద్ద స్వామీజీ పోటోను పెట్టాలి .
  • జాతీయవాదాన్ని మేల్కొల్పే కార్యక్రమాలను రూపొందించాలి .
ఈ ఉత్సవాల మాధ్యమంగా భాగ్యనగర్ లో ప్రతి డివిజన్ నుండి హిందూ జాతి గర్వ పడే నాయకులు నిర్మాణం కావాలి , ఈ సంవత్సరం గణేష్ ఉత్సవాలను మరింత స్పూరివంతంగా నిర్వహించేందుకు సహకరించాలి " అని అన్నారు 

దావూద్ ఇబ్రహీంను పట్టుకోవడం కేంద్ర ప్రభుత్వానికి చేతకాకపోతే భజరంగ్ దళ్ ను పంపుతాం : స్వామి చిన్మయానంద 
ఈ సందర్భంగా చిన్మయానంద మాట్లాడుతూ దావూద్ ఇబ్రహీంను పట్టుకోవడం కేంద్ర ప్రభుత్వానికి చేతకాకపోతే చెప్పమనండి, మా బజరంగ్‌దళ్ కార్యకర్తలను పంపిస్తామని ఆయన పేర్కొన్నారు.  ప్రజాస్వామ్య దేశంలో శాంతియుతంగా రామ జన్మభూమి అయోధ్యలో ర్యాలీలు నిర్వహించుకోవడానికి కూడా హిందువులకు హక్కు లేదా అని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. స్వాతంత్య్రం వచ్చినా కూడా దేశం ఇంకా ఆంగ్లేయుల పాలనలోనే ఉందని ఆయన సోనియా గాంధీని ఉద్దేశించి పరోక్షంగా విమర్శలు చేశారు 
"దావూద్ ఇబ్రహీంను పట్టుకోవడం కేంద్ర ప్రభుత్వానికి చేతకాకపోతే చెప్పమనండి, మా బజరంగ్‌దళ్ కార్యకర్తలను పంపిస్తాం" : BGUS బహిరంగ సభలో స్వామి చిన్మయానంద Reviewed by JAGARANA on 12:48 PM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.