సేవాలాల్ జయంతి సందర్భంగా 10 గ్రామాల 209 కుటుంబాల నుండి 725 మంది గిరిజనుల పునరాగమణనము
16-Feb-2013 , మిర్యాలగూడా , నల్గొండ :
గిరిజనుల ఆరాధ్యుడు శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భాగా నల్గొండ
జిల్లా మిర్యాలగూడా లో విశ్వ హిందు పరిషద్ - పస్చిమాంద్ర, ధర్మ ప్రసార
సమితి ,శ్రీ ఉపేందర్ , శ్రీ బాలు నాయాక్ మరియు జై ల్ సింగ్ ల ఆధ్వర్యంలో
జరిగిన పరావర్తన కార్యక్రమంలో చుట్ట ప్రక్కల పది గ్రామాలనుండి 209
కుటుంబాలకు చెందిన 725 మంది యజ్ఞ క్రతువు ద్వారా తిరిగి హిందుత్త్వాన్ని
స్వీకరించారు ,
![]() |
మార్గదర్శనం చేస్తున్న పూజ్య శ్రీ సంగ్రాం మహారాజ్ |
ఈ కార్యక్రమంలో పూజ్య శ్రీ సంగ్రాం మహారాజ్
మార్గ నిర్దేశం చేస్తూ హిందు ధర్మం పై విజాతియ మూకల దాడులను త్రిప్పి
కొట్టడంలో శ్రీ సేవాలాల్ మహారాజ్ చేసిన కృషిని గుర్తుచేసారు , ఆయన స్వయంగా
భవాని అమ్మ వారి అనుగ్రహం పొందారని ఆయన వారసులమైనా మనం పర ధర్మాన్ని
స్వీకరించడం సమర్ధనీయం కాదని అన్నారు, కార్యక్రమ అనంతరం వారికి క్రొత్త
బట్టలు మరియు ఆంజనేయ స్వామీ లాకెట్ అందిచడం జరిగింది ,
![]() |
శ్రీ సత్యం జి మార్గదర్శనం |
ఈ కార్యక్రమంలో కేంద్రీయ సహా కార్తదర్శి శ్రీ
గుమ్మల సత్యం గారు , శ్రీ వి సురేందర్ రెడ్డి గారు , పరిషద్ కార్యకర్తలు ,
స్థానిక రాజకీయ నాయకులు పాల్గొన్నారు , అందరు కలసి చేసిన సహా పంక్తి
భోజనంతో కార్యక్రమం ముగిసింది
Source: www.vhpap.org
సేవాలాల్ జయంతి సందర్భంగా 10 గ్రామాల 209 కుటుంబాల నుండి 725 మంది గిరిజనుల పునరాగమణనము
Reviewed by JAGARANA
on
11:32 AM
Rating:

Post Comment
No comments: