ఆమె నిష్కామ కర్మ యోగిని-నేడుసోదరి నివేదిత జయంతి
Authour: బి ఎస్ శర్మ Source
| సోదరి నివేదిత |
స్వామి వివేకానందుని ఉపన్యాసాలకు, హైందవ తత్వ
శాస్త్రానికీ ముగ్ధులైన అనేకమంది విదేశీయులు స్వామిజీకి శిష్యులైనారు.
వారిలో ప్రముఖులు ‘సోదరి నివేదిత’. మిస్ మార్గరెట్ నోబుల్గా స్వామిజీ
ఆహ్వానంపై భారతదేశానికి వచ్చారు.
సోదరి నివేదిత ఉత్తర ఐర్లాండ్లోని డంగనాన్ అనే చిన్న పట్టణంలో 28 అక్టోబర్, 1867న శ్రీ సామ్యూల్ రిచ్మండ్ నోబుల్, శ్రీమతి మేరీ ఇసాబెల్ నోబుల్ దంపతులకు జన్మించింది. ‘మార్గరెట్’ చిన్నతనం నుంచి మంచి కుశాగ్రబుద్ధి కల్గి ఉండేది. తండ్రి అకాలమరణంతో కుటుంబ పోషణ కోసం పదిహేడేళ్ళ మార్గరెట్ ఉపాధ్యాయ వృత్తిని చేపట్టింది. మంచి బోధకురాలిగా పేరు, ప్రతిష్ఠలను పొందింది. పత్రికా వ్యాసంగం ఆ చిరువయస్సులోనే అబ్బింది. పాఠశాలలో పనిచేస్తూనే అక్కడి స్థానిక చర్చితో సంబంధం పెట్టుకుంది. చివరకు ‘నన్’గా దైవానికి తన జీవితాన్ని నివేదించుకోవాలని నిర్ణయం చు కొని, క్రైస్తవం లోని అన్ని శాఖలవారికి తేడా లేకుండా సేవచేయటం స్థానిక చర్చి అధికారులకు నచ్చలేదు. చర్చి అధికారుల సంకుచిత మనస్తత్వానికి ఆమె ఖిన్నురాలైంది. చర్చికి పోవటం తగ్గించివేసింది. ఆమెలో ఏర్పడిన వెలితిని బుద్ధుని ప్రవచనాలు పూరించగలిగాయి. బౌద్ధంపై అధ్యయనం సాగించింది. తర్వాత‘వెల్ష్మేన్’ అనే ఓ ఇంజనీరును వివాహం చేసుకొని ఆధ్యాత్మిక అధ్యయనం చేద్దామనుకొనే సమయానికి ఆ యువకుని మరణం - ఆమెకు కృంగదీసింది. ఆ విషాదాన్ని తట్టుకోవడానికి రెక్స్హోమ్ నుండి బదిలీ చేయించుకొని చెస్ట్ర్ చేరుకొన్నది. అక్కడ రిస్క్న్ స్కూలు స్థాపించి విద్యాబోధన చేస్తూనే లండన్, పట్టణంలో సాహితీ విమర్శకురాలిగా, విద్యావేత్తగా పేరు సంపాదించింది.
అది 1893 సంవత్సరం. మార్గరెట్ స్నేహితురాలు ఇసాబెల్ ఇంటికి స్వామి వివేకానం దుడిని ఆహ్వానించారు. మార్గరెట్ కూడా ఆయన్ను చూడటం అదే తొలిసారి. ఆత్మ, పరమాత్మ, పునర్జన్మ జన్మరాహిత్యం మొదలైన పదాలన్నింటికి అర్థాలను ఆయనను అడిగి తెలుసుకొంది. ఆయన సమాధానాలు ఆమె నెంతగానో ప్రభావితం చేసాయి. ‘మార్గరెట్’ స్వామిజీకి భక్తురాలై పోయింది. స్వామిజీ వెంటనే ఉంటూ ఆయన పర్యటించిన చోట ఉపన్యాసాలను శ్రద్ధతో వ్రాసుకొన్నది. ఈనాడు మనకి లభిస్తున్న వివేకానందవాణి అక్షర మవటానికి కారణభూతురాలైంది. స్వామిజీ నుంచి 1897 జూలైలో ఆమెకు పిలుపు వచ్చింది. 1898వ సంవత్సరం జనవరి 28వ తేదీన మార్గరెట్ కలకత్తా రేవుకి చేరుకొంది. స్వామిజీ స్వయంగా స్వాగతం పలికారు. 1898 మార్చి 11వ తేదీన కలకత్తా స్టార్ థియేటర్లో ఏర్పాటైన రామకృష్ణమఠ ప్రారంభ సభలో స్వామిజీ ఆమెను సభాముఖంగా పరిచయం చేశారు. 1898 మార్చి 17వ తేదీన శారదామాతను కలుసుకొంది. శారదామాత ఆమెతో కలిసి ఫలహారం చేసింది. ఆమెను పుత్రికగా స్వీకరించింది.అది 1998 మార్చి 25వ తేదీ మార్గరెట్ జీవితంలో ఒక సువర్ణపుటం - బేలూర్లో నిలాంబర ముఖర్జీ ఇంటిలోని దైవమందిరం - ‘అసతోమా సద్గమయా’ అనే ప్రార్థనతో మారుమ్రోగుతున్న మంటపం - స్వామిజీ తంబూరా తీసుకొని ‘శివపార్వతీస్తవం’ గానం చేశారు. మార్గరెట్ నుదుట ‘విభూతి’ని ఉంచారు స్వామిజీ. మార్గరెట్ ఈ రోజు నుంచి ‘నివేదిత’గా పిలువబడుతుంది’’ అని ప్రకటించారు స్వామిజీ. తర్వాత ‘‘నివేదితా అదిగో గంగ అవతల నీవు ఓ బాలికల పాఠశాల ప్రారంభించు’’ అని సూచించారు. 25-03-1899 తేదీ స్వామిజీ నివేదితకు బ్రహ్మచారిణికి ఇచ్చే అంతిమ దీక్ష ఇచ్చారు. 1898 నవంబర్ 11న కతన ఇంట్లోనే నివేదిత ఓ బాలికల విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించింది. మ్లేచ్ఛ స్ర్తి అని కొందరు నిందించినా పట్టుదలతో తిరిగి పాఠశాలలో బాలికల సంఖ్యను పెంచింది. 1899 మార్చిలో బెంగాల్లో ప్లేగు వ్యాధి వ్యాపించి ఎందరినో కబళించింది. స్వామివివేకానంద, తన శిష్యులతో ‘ప్లేగు సేవాసమితి’ అనే సంస్థను ప్రారంభించి, దాని కార్యభారం నివేదితకు అప్పగించారు. ఈ సేవా కార్యక్రమంలో ‘నివేదిత’ మమేకమై పని చేసింది. భారత చరిత్రను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, ‘చిక్కుముళ్ళ భారతీయ జీవనం (వెబ్ ఆఫ్ ఇండియన్ లైఫ్) అనే గ్రంథాన్ని రచించింది. వివేకానందుడి మరణానంతరం తిరిగి తన దేశం వెళ్ళిపోలేదు నివేదిత. రాజకీయ కార్యకలాపాలలో తీవ్రంగా పాల్గొనాలని నిర్ణయించుకొని, ‘రామకృష్ణ మఠం’కు రాజీనామా సమర్పించింది. బిపిన్ చంద్రపాల్ నడిపే ‘న్యూ ఇండియా పత్రిక’, అరవిందుని ‘యుగాంతర్’ పత్రిక, తిలక్ నిర్వహించిన మరాఠా కేసరి’ పత్రికలలో ఈమె వ్యాసాలు తరచూ వచ్చేవి. వాటిలో ‘తీవ్ర హిందుత్వం’ వ్యాసం సంచలనమే సృష్టించింది. 1906లో జాతీయ కాంగ్రెస్ సమావేశాలకు ఆమె జాతీయ పతాకాన్ని సృష్టించి ఇచ్చింది. కాషాయ జెండాపై రెండు వజ్రాయుధాలు, వందేమాతరం, యతోధర్మస్తతో జయః అనే ధ్యేయ వాక్యాలు ఉన్నాయి. ఇది ఆమె ఆలోచనల లోతును తెలియ జేస్తుంది. ఆమె నిష్కామ కర్మయోగిని. అవిశ్రాంత పరిశ్రమవల్ల 1911 నుంచి ఆమె శరీరం బలహీన పడుతూ వచ్చింది. జగదీశ చంద్రబోస్ కుటుంబం ఆమెను డార్జిలింగ్ తీసుకొని వెళ్ళారు. అక్కడే ఆమె అక్టోబర్ 13వ తేదీన పరమపదించింది.
సోదరి నివేదిత ఉత్తర ఐర్లాండ్లోని డంగనాన్ అనే చిన్న పట్టణంలో 28 అక్టోబర్, 1867న శ్రీ సామ్యూల్ రిచ్మండ్ నోబుల్, శ్రీమతి మేరీ ఇసాబెల్ నోబుల్ దంపతులకు జన్మించింది. ‘మార్గరెట్’ చిన్నతనం నుంచి మంచి కుశాగ్రబుద్ధి కల్గి ఉండేది. తండ్రి అకాలమరణంతో కుటుంబ పోషణ కోసం పదిహేడేళ్ళ మార్గరెట్ ఉపాధ్యాయ వృత్తిని చేపట్టింది. మంచి బోధకురాలిగా పేరు, ప్రతిష్ఠలను పొందింది. పత్రికా వ్యాసంగం ఆ చిరువయస్సులోనే అబ్బింది. పాఠశాలలో పనిచేస్తూనే అక్కడి స్థానిక చర్చితో సంబంధం పెట్టుకుంది. చివరకు ‘నన్’గా దైవానికి తన జీవితాన్ని నివేదించుకోవాలని నిర్ణయం చు కొని, క్రైస్తవం లోని అన్ని శాఖలవారికి తేడా లేకుండా సేవచేయటం స్థానిక చర్చి అధికారులకు నచ్చలేదు. చర్చి అధికారుల సంకుచిత మనస్తత్వానికి ఆమె ఖిన్నురాలైంది. చర్చికి పోవటం తగ్గించివేసింది. ఆమెలో ఏర్పడిన వెలితిని బుద్ధుని ప్రవచనాలు పూరించగలిగాయి. బౌద్ధంపై అధ్యయనం సాగించింది. తర్వాత‘వెల్ష్మేన్’ అనే ఓ ఇంజనీరును వివాహం చేసుకొని ఆధ్యాత్మిక అధ్యయనం చేద్దామనుకొనే సమయానికి ఆ యువకుని మరణం - ఆమెకు కృంగదీసింది. ఆ విషాదాన్ని తట్టుకోవడానికి రెక్స్హోమ్ నుండి బదిలీ చేయించుకొని చెస్ట్ర్ చేరుకొన్నది. అక్కడ రిస్క్న్ స్కూలు స్థాపించి విద్యాబోధన చేస్తూనే లండన్, పట్టణంలో సాహితీ విమర్శకురాలిగా, విద్యావేత్తగా పేరు సంపాదించింది.
అది 1893 సంవత్సరం. మార్గరెట్ స్నేహితురాలు ఇసాబెల్ ఇంటికి స్వామి వివేకానం దుడిని ఆహ్వానించారు. మార్గరెట్ కూడా ఆయన్ను చూడటం అదే తొలిసారి. ఆత్మ, పరమాత్మ, పునర్జన్మ జన్మరాహిత్యం మొదలైన పదాలన్నింటికి అర్థాలను ఆయనను అడిగి తెలుసుకొంది. ఆయన సమాధానాలు ఆమె నెంతగానో ప్రభావితం చేసాయి. ‘మార్గరెట్’ స్వామిజీకి భక్తురాలై పోయింది. స్వామిజీ వెంటనే ఉంటూ ఆయన పర్యటించిన చోట ఉపన్యాసాలను శ్రద్ధతో వ్రాసుకొన్నది. ఈనాడు మనకి లభిస్తున్న వివేకానందవాణి అక్షర మవటానికి కారణభూతురాలైంది. స్వామిజీ నుంచి 1897 జూలైలో ఆమెకు పిలుపు వచ్చింది. 1898వ సంవత్సరం జనవరి 28వ తేదీన మార్గరెట్ కలకత్తా రేవుకి చేరుకొంది. స్వామిజీ స్వయంగా స్వాగతం పలికారు. 1898 మార్చి 11వ తేదీన కలకత్తా స్టార్ థియేటర్లో ఏర్పాటైన రామకృష్ణమఠ ప్రారంభ సభలో స్వామిజీ ఆమెను సభాముఖంగా పరిచయం చేశారు. 1898 మార్చి 17వ తేదీన శారదామాతను కలుసుకొంది. శారదామాత ఆమెతో కలిసి ఫలహారం చేసింది. ఆమెను పుత్రికగా స్వీకరించింది.అది 1998 మార్చి 25వ తేదీ మార్గరెట్ జీవితంలో ఒక సువర్ణపుటం - బేలూర్లో నిలాంబర ముఖర్జీ ఇంటిలోని దైవమందిరం - ‘అసతోమా సద్గమయా’ అనే ప్రార్థనతో మారుమ్రోగుతున్న మంటపం - స్వామిజీ తంబూరా తీసుకొని ‘శివపార్వతీస్తవం’ గానం చేశారు. మార్గరెట్ నుదుట ‘విభూతి’ని ఉంచారు స్వామిజీ. మార్గరెట్ ఈ రోజు నుంచి ‘నివేదిత’గా పిలువబడుతుంది’’ అని ప్రకటించారు స్వామిజీ. తర్వాత ‘‘నివేదితా అదిగో గంగ అవతల నీవు ఓ బాలికల పాఠశాల ప్రారంభించు’’ అని సూచించారు. 25-03-1899 తేదీ స్వామిజీ నివేదితకు బ్రహ్మచారిణికి ఇచ్చే అంతిమ దీక్ష ఇచ్చారు. 1898 నవంబర్ 11న కతన ఇంట్లోనే నివేదిత ఓ బాలికల విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించింది. మ్లేచ్ఛ స్ర్తి అని కొందరు నిందించినా పట్టుదలతో తిరిగి పాఠశాలలో బాలికల సంఖ్యను పెంచింది. 1899 మార్చిలో బెంగాల్లో ప్లేగు వ్యాధి వ్యాపించి ఎందరినో కబళించింది. స్వామివివేకానంద, తన శిష్యులతో ‘ప్లేగు సేవాసమితి’ అనే సంస్థను ప్రారంభించి, దాని కార్యభారం నివేదితకు అప్పగించారు. ఈ సేవా కార్యక్రమంలో ‘నివేదిత’ మమేకమై పని చేసింది. భారత చరిత్రను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, ‘చిక్కుముళ్ళ భారతీయ జీవనం (వెబ్ ఆఫ్ ఇండియన్ లైఫ్) అనే గ్రంథాన్ని రచించింది. వివేకానందుడి మరణానంతరం తిరిగి తన దేశం వెళ్ళిపోలేదు నివేదిత. రాజకీయ కార్యకలాపాలలో తీవ్రంగా పాల్గొనాలని నిర్ణయించుకొని, ‘రామకృష్ణ మఠం’కు రాజీనామా సమర్పించింది. బిపిన్ చంద్రపాల్ నడిపే ‘న్యూ ఇండియా పత్రిక’, అరవిందుని ‘యుగాంతర్’ పత్రిక, తిలక్ నిర్వహించిన మరాఠా కేసరి’ పత్రికలలో ఈమె వ్యాసాలు తరచూ వచ్చేవి. వాటిలో ‘తీవ్ర హిందుత్వం’ వ్యాసం సంచలనమే సృష్టించింది. 1906లో జాతీయ కాంగ్రెస్ సమావేశాలకు ఆమె జాతీయ పతాకాన్ని సృష్టించి ఇచ్చింది. కాషాయ జెండాపై రెండు వజ్రాయుధాలు, వందేమాతరం, యతోధర్మస్తతో జయః అనే ధ్యేయ వాక్యాలు ఉన్నాయి. ఇది ఆమె ఆలోచనల లోతును తెలియ జేస్తుంది. ఆమె నిష్కామ కర్మయోగిని. అవిశ్రాంత పరిశ్రమవల్ల 1911 నుంచి ఆమె శరీరం బలహీన పడుతూ వచ్చింది. జగదీశ చంద్రబోస్ కుటుంబం ఆమెను డార్జిలింగ్ తీసుకొని వెళ్ళారు. అక్కడే ఆమె అక్టోబర్ 13వ తేదీన పరమపదించింది.
ఆమె నిష్కామ కర్మ యోగిని-నేడుసోదరి నివేదిత జయంతి
Reviewed by JAGARANA
on
10:54 AM
Rating:
No comments: